చింతకాని : మండలంలో పాతర్లపాడు గ్రామంలో సోసైటీ పరిధిలోని రైతులకు, డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులకు నగదు రహిత లావాదేవిలపై బుర్రకథ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నాగులవంచ సోసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు మాట్లాడుతూ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నదని, దానిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులు, రైతులు తమ చెల్లింపులు ఆన్లైన్, యాప్ల ద్వారా కోనసాగించాలని సూచించారు. పంట రుణాలను రైతులు రీషెడ్యూల్ చేయించుకోని ప్రభుత్వ సబ్సీడీలను పోందాలని కోరారు.
అనంతరం ఆన్లైన్ విధానం, యాప్లపై బుర్రకథ బృందం ద్వారా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, సీఈవో యాలముడి శ్రీనివాసరావు, బ్యాంకు మేనేజర్ మంజూష, నాబార్డు ప్రతినిధులు, ఉపసర్పంచ్ తేలుకుంట్ల శ్రీనివాసరావు, బ్యాంకుమిత్రలు, రైతులు పాల్గొన్నారు.