సత్తుపల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మునిసిపల్ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో తడి, పొడిచెత్త సేకరణపై పారిశుధ్య కార్మికులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు తడి, పొడిచెత్తను ఎలా సేకరించాలి…? ఎలా వేరుచేయాలి..? అనే దానిపై అవగాహన కల్పించారు.
హానికరమైన చెత్తను ఎలా వేరుచేయాలనే విషయాన్ని వారికి వివరిస్తూ జాగ్రత్తలు పాటిస్తూ చెత్త సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ రఘు, హెల్త్ అసిస్టెంట్ దరిపల్లి కిరణ్, శానిటరీ సూపర్వైజర్లు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.