మధిరరూరల్, మే 21: మండలంలోని రొంపిమళ్ల గ్రామంలో పీఎం కిసాన్ ఈ-కేవైసీపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తున్న ప్రతిఒక్కరూ ఈ-కేవైసీ చేసుకుంటేనే 11 విడత సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమవుందని పేర్కొన్నారు. ఈ నెల 31 లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. వంశీకృష్ణ, మదార్సాహెబ్, ముక్కెర వెంకట్రామిరెడ్డి రైతులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, మే 21: ఈ నెల 31వ తేదీ లోపు రైతులు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఏవో నాగేశ్వరరావు రైతులకు సూచించారు. శనివారం మండలంలోని కస్నాతండ, తెల్దారుపల్లి, గుర్రాలపాడు రైతు వేదికల్లో ఈ-కేవైసీ ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవోలు విజయ్కుమార్, నజ్మాకౌసర్, ఎం వెంకటేశ్వర్లు, ఎం శ్రీకన్య పాల్గొన్నారు.