ఖమ్మం, అక్టోబర్ 14: సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అండదండలతో ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని 12వ డివిజన్లో శనివారం విద్యావేత్త పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అండదండలతోనే ఖ మ్మం నగరంలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి తనను గెలిపిస్తే నగరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు. అతి తకువ సమయంలో నగరాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపామన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఖమ్మం స్వరూ పం పూర్తిగా మారిపోయిందన్నారు. ఇకడి నుంచి ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లి తిరిగి వచ్చి న వారు నగరాభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారన్నా రు. తనకు స్వయంగా అనేక మంది కాల్ చేసి అభినందించారన్నారు.
అభివృద్ధి ఒక్కరోజులో సాధ్యం కాలేదన్నారు. పక్కాగా ప్రణాళికలు వేసుకుని అంచెలంచెలుగా అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. అభివృద్ధి పనులు చేపట్టి నగర స్వరూపాన్ని మారుస్తానంటే, మంత్రి కేటీఆర్ తనకు అండగా నిలిచారన్నారు. ఎప్పటికప్పుడు నగరాభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేశారని కొనియాడారు. నగరంలో కొత్త బస్టాండ్ నిర్మాణ పనులను తొలుత ఓ కాంట్రాక్టర్కు అప్పగించామని, సదరు కాంట్రాక్టర్ పనుల్లో తీవ్ర జాప్యం చేశాడన్నారు. దీంతో తాను చొరవ తీసుకుని మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించామన్నారు. తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే పనులు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఒకప్పుడు నగరంలోని త్రీ టౌన్ ప్రాంతం గోళ్లపాడు చానల్ కారణంగా మురికి కూపంగా ఉండేదని, గత పాలకులు ఎవరూ పరిస్థితిని చక్కదిద్దాలని యత్నించలేదని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సంవత్సరంలోనే గోళ్లపాడు చానల్ ఆధునీకరణ పనులు ప్రారంభించానని గుర్తుచేశారు. ఇప్పుడు గోళ్లపాడు చానల్ ప్రాంతంలో పార్క్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో నివాసం ఉండటానికి ఇబ్బంది పడిన ప్రజలు, ఇప్పుడు ఆ ప్రజలే ఇదే ప్రాంతంలో స్థలం కొనుకుని ఉండటానికి ఆసక్తి చూపుతున్నారన్నారు.
నగరంలో పలుచోట్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అందరినీ ఒప్పించి రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులు, చేపట్టామన్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలకు తావే లేదన్నారు. ఒకప్పుడు ఖమ్మం ప్రధానాసుపత్రి సరైన వసతులు లేకుండా దారుణంగా ఉండేదన్నారు. తాను ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి సూపర్ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దామన్నారు. కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. నాడు ప్రజల బాగోగులు పట్టించుకోని కపట నాయకులు నేడు ప్రజలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నారన్నారు. అలాంటి వారికి ప్ర జల బాగోగులపై ఎలాంటి బాధ్యత ఉండదన్నారు. కార్య క్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, భద్రాద్రి బ్యాంక్ చైర్మ న్ చెరుకూరి కృష్ణమూర్తి, ఖమ్మం వర్తక సంఘం చైర్మన్ చిన్ని కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రశాంతి లక్ష్మి, పసుమర్తి రామ్మోహన్, సందీప్, పసుమర్తి లక్ష్మణరావు, కొత్తా వెంకటేశ్వరరావు, అమరబొయిన వెంకటేశ్వర్లు, మాటురి లక్ష్మీనారాయణ, గరికపాటి వేంకటేశ్వరరావు, వల్లభనేని రామారావు పాల్గొన్నారు.