రఘునాథపాలెం, జనవరి12: ఈ నెల 18న ఖమ్మంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు. సీఎం ప్రారంభించనున్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, పాల్గొననున్న బహిరంగ సభ వేదిక-స్థలాన్ని గురువారం పరిశీలించారు.
ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్పై పోలీస్ అధికారులతో చర్చించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ సర్కిల్, వరంగల్ క్రాస్ రోడ్డు, కోదాడ క్రాస్ రోడ్డు, ఇల్లందు రోడ్డు, వెంకటగిరి రోడ్డు, కొదుమూరు రోడ్డు, కొణిజర్ల రోడ్డును పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.