ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతోపాటు సభ్యత్వ నమోదును వేగవంతం చేసేందుకు సంస్థాగత చర్యలకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావును పార్టీ అధిష్టానం నియమించిన విషయం విదితమే. సభ్యత్వ నమోదు గురించి నియోజకవర్గస్థాయి సమావేశం, మండలస్థాయి సమన్వయ కమిటీ సభ్యుల ఎంపిక పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు సభ్యత్వ నమోదు ఇన్చార్జీలను పార్టీ గురువారం నియమించింది.
కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జిగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా నామా నాగేశ్వరరావు, వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా ఆర్జేసీ కృష్ణ, సత్తుపల్లికి కూరాకుల నాగభూషణం, ఇల్లెందుకు చాడా కిషన్రెడ్డి, పినపాకకు దిండిగాల రాజేందర్, అశ్వారావుపేటకు ఉప్పల వెంకటరమణ, భద్రాచలానికి రావులపల్లి రాంప్రసాద్, ఖమ్మానికి ఏనుగుల రాకేశ్రెడ్డిలను నియమించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జితో సమన్వయం చేసుకొని సభ్యత్వ నమోదును వేగవంతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు పార్టీ నిర్మాణంపై దిశా నిర్దేశం చేయనున్నారు.