ఖమ్మం : నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్(ఎన్టీఎస్ఈ) ఫస్ట్ లెవల్ పరీక్ష రాసేందుకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్ధల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. రూ.100ల చలానా రూపంలో మాత్రమే చెల్లించాలని, నవంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు గడువు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలకు WWW.BSE.TELANGANA.GOV.IN వెబ్సైట్లోచూడొచ్చు. లేదంటే డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.