మామిళ్లగూడెం, జనవరి 29 : గ్రీవెన్స్లో బాధితులు సమర్పించే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డేలో కలెక్టర్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిషార స్వభావం కలిగిన భూ సమస్యలను కలెక్టర్ సత్వరమే పరిషరించారు.
పెనుబల్లి, కూసుమంచి, నేలకొండపల్లి, సత్తుపల్లి, చింతకాని మండలాలకు చెందిన పలువురు గ్రీవెన్స్ డేలో వినతులు సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఆర్డీవో విద్యాచందన, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.