కారేపల్లి,జులై 6 : కారేపల్లిలోని పురాతన దేవాలయమై శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఆలయంలో అర్చకులు ముక్కామాల మల్లిఖార్జున శర్మ, సురేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకములు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులతో కుంకుమ పూజలు, గణపతి, మృత్యంజయ నవగ్రహా శాంతి పూజలు జరిపించారు. అనంతరం ఆలయం కమిటీ అధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్ (టోనీ), మాజీ వైస్ ఎంపీపీ దంపతులు ఇమ్మడి రమాదేవి-తిరుపతిరావు ప్రారంభించారు.