వైరా రూరల్, సెప్టెంబర్ 8: దాచాపురంలోని ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈక్రమంలో అటుగా వస్తున్న కారును ఆపి సోదా చేశారు.
కారులో 80 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఆంగోతు నాగరాజు, ధరావత్ కృష్ణను అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు మరో 25 కిలోల గంజాయితో పరారయ్యారు. నిందితులు ఆంధ్రాలోని సీలేరులో గంజాయి సేకరించి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడ్డారని ఎస్సై తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.17లక్షలు ఉంటుందన్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులు సూర్యాపేటకు జిల్లాకు లాల్సింగ్తండాకు చెందిన వారిగా గుర్తించామన్నారు.