ఖమ్మం :రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ఏస్మైల్ ద్వారా అంబులెన్స్ లు ఇవ్వమని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి గ్రామానికి చెందిన తాండ్ర నారాయణరావు మెమోరియల్ ట్రస్ట్ తరపున తాండ్ర వెంకటేశ్వరరావు( యూఎస్ఏ) సోమవారం అంబులెన్స్ను హైద్రాబాద్లో మంత్రి కేటీఆర్కు అందచేశారు.
ఈ అంబులెన్స్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా తాండ్ర వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.