ఇల్లెందు రూరల్, జనవరి 27: దేశ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ అరంగేట్రం శుభపరిణామమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ఇలాంటి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ ప్రశంసించడం గర్వకారణమని అన్నారు. పట్టణంలోని 21 పిట్ ఏరియా, విజయలక్ష్మినగర్, తిలక్నగర్లలో వివిధ పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
ముందుగా 21 పిట్ ఏరియాలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఏఎంసీ చైర్మన్ హరిసింగ్నాయక్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పులిగళ్ల మాధవరావు, శీలం రమేశ్, రేణుక, దాస్యం ప్రమోద్, మెట్ల కృష్ణ, నాగరాజు, రాజేశ్వరీ, మహేశ్, చిన్నారి, ముస్తాఫా, కుమార్, కృష్ణవేణి, నాను, లక్ష్మణ్నాయక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.