ఖమ్మం రూరల్, జనవరి 25 : రైతుల సౌలభ్యం, ఏటేటా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి 2018 సంవత్సరంలో విడిపోయి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్గా అధికారికంగా రూపాంతరం చెందింది. నూతన మార్కెట్ నిర్మాణం, ఇతర అవసరాల నిమిత్తం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి నిధులు సైతం మద్దులపల్లి మార్కెట్కు బదలాయించడంతోపాటు, ఉద్యోగుల విభజన కూడా జరిగింది. భౌతికంగా మార్కెట్ నిర్మాణం లేకపోయినప్పటికీ ఇతర వనరుల ద్వారా ఉద్యోగులు రాష్ట్ర మార్కెటింగ్శాఖ నిర్దేశించిన లక్ష్యాలకు మించి ఆదాయం సమకూర్చగలిగారు. 2019-20లో రూ.74.59 లక్షలు, 2020-21లో రూ.3.72 కోట్లు, 2021-22లో రూ.1.86 కోట్లు, 2022-23లో రూ.1.87 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరానికి(2023-24) గాను రాష్ట్ర మార్కెటింగ్శాఖ రూ.3 కోట్ల ఆదాయం టార్గెట్గా పెట్టింది. ప్రస్తుతం మద్దులపల్లి మార్కెట్ పరిధిలో ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం(మొత్తం 44 గ్రామాలు) మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1 చెక్పోస్టు, 4 జిన్నింగ్ మిల్లులు, 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన సైంటిఫిక్ గోడౌన్లు, 4 రైస్మిల్లులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 8 కోల్డ్స్టోరేజీలు(8 లక్షల బస్తాల సామర్థ్యం) ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కోల్డ్స్టోరేజీల ఆదాయం మాత్రం మద్దులపల్లి మార్కెట్కు అంద కపోవడం విస్మయానికి గురిచేస్తున్నది.
మద్దులపల్లి మార్కెట్ పరిధిలో ప్రస్తుతం 8 కోల్డ్స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో సుమారు 8 లక్షల బస్తాలను నిల్వ పెట్టుకునే సామర్థ్యం ఉంది. ఏటా రైతులు 4 లక్షల బస్తాలను నిల్వ చేసుకుంటున్నారు. క్వింటాల్ ధర తక్కువలో తక్కువ రూ.15 వేలు పలికినప్పటికీ ఏటా ఈ కోల్డ్స్టోరేజీల ద్వారా మార్కెట్కు సుమారు రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల పైబడి ఆదాయం వస్తుంది. అయితే మార్కెట్ ఏర్పడి ఐదేండ్లు కావస్తున్నప్పటికీ కోల్డ్స్టోరేజీల ద్వారా వచ్చే ఆదాయం మద్దులపల్లి మార్కెట్ ట్రెజరీలోకి వెళ్లడం లేదు. ఎందుకంటే కోల్డ్స్టోరేజీలో ఉన్న పంటను అమ్ముకునే సమయంలో ఖరీదుదారుడికి పంట మొత్తంలో నుంచి ఒక బస్తాను శాంపిల్గా చూపించాల్సి ఉంటుంది. ఈ కారణంతో రైతులు మండల పరిధిలోని కోల్డ్స్టోరేజీలో నిల్వ చేసుకున్న పంటలో నుంచి ఒక బస్తాను శాంపిల్ కోసం ఖమ్మం ఏఎంసీకీ తీసుకెళ్తున్నారు. దీంతో అక్కడి ఖరీదుదారులు కొనుగోలు చేస్తున్నందున తమ మార్కెట్కే ఆదాయం రావాలనే ఉద్దేశంతో కోల్డ్స్టోరేజీల ఆదాయం ఖమ్మం ఏఎంసీకి ట్రెజరీకి చేరుతున్నది. అయితే మండల పరిధిలో ఉన్న జిన్నింగ్మిల్లుల వద్ద సీసీఐ పత్తి కొనుగోళ్ల ఆదాయం మాత్రం మద్దులపల్లి మార్కెట్కు వస్తున్నది. కేవలం మిర్చి పంట విషయంలోనే అలా జరుగుతుండంతో మార్కెట్ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. కేవలం శాంపిల్స్ మాత్రమే అక్కడ జరుగుతుండగా, కాంటాలు ఇతర ప్రక్రియ మొత్తం కోల్డ్స్టోరేజీల వద్దనే జరుగుతున్నది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నూతన మార్కెట్లో చిన్నపాటి ఫ్లాట్ఫాంను ఏర్పాటు చేసినైట్లెతే శాంపిల్స్ సైతం ఇక్కడే చూసుకునే అవకాశం ఉంటుంది. తద్వార ఇక్కడి ఆదాయం ఈ మార్కెట్కే చెందనున్నది.
మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. సాధారణంగా వ్యవసాయ మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లులు, సైంటిఫిక్ గోడౌన్లు, కోల్డ్స్టోరేజీలు, రైస్మిల్లులు, చెక్పోస్టులు మొత్తం సదరు మార్కెట్ పరిధిలోకి వస్తాయి. మార్కెట్లో జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించిన ఆదాయంతోపాటు ఇతర వనరుల నుంచి పన్నులు సైతం ఆ మార్కెట్ ట్రెజరీలో జమకావడం సర్వసాధారణం. అయితే ఖమ్మంరూరల్ మండల పరిధిలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనపడుతున్నది.
మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఏర్పడి నాలుగేండ్లు పూర్తయ్యింది. అయినా నేటివరకు రాష్ట్ర మార్కెటింగ్శాఖ మద్దులపల్లి మార్కెట్కు ఎలాంటి హోదా ఇవ్వలేదు. సాధారణంగా కొత్త మార్కెట్ ఏర్పడితే మూడు సంవత్సరాల తర్వాత గ్రేడింగ్ ఇస్తుంటారు. అలాంటిది నాలుగేళ్లు పైబడినా ఇంతవరకు అతీగతీ లేదు. మార్కెట్ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని సదరు మార్కెట్కు గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 హోదా ఇవ్వాల్సి ఉంటుంది. హోదాను బట్టి సెక్రటరీల నియామకం ఉంటుంది. కానీ మద్దులపల్లి మార్కెట్కు పర్యవేక్షకుడు మాత్రమే సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ నిర్మాణం పూర్తికాకపోయినప్పటికీ ఇతర వనరులైన చెక్పోస్టు, జిన్నింగ్ మిల్లులు, రైస్మిల్లులు, ఐకేపీ తదితర మార్గాల ద్వారా ఏటా సరాసరి రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల ఆదాయం సమకూర్చుతున్నారు. అయితే మార్కెట్ ఆదాయానికి గండిపడడంతో ఆ ప్రభావం హోదాపై పడి తద్వార మార్కెట్ అభివృద్ధి విషయంలో సైతం తీవ్ర ప్రభావం చూపనున్నది. ఇప్పటికైనా మార్కెట్కు గ్రేడ్ ప్రకటించి అదనపు సిబ్బందిని నియమించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మద్దులపల్లి మార్కెట్ పరిధిలోని మొత్తం కోల్డ్స్టోరేజీలను ఆ మార్కెట్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతున్నది. కొద్దిరోజుల క్రితం మద్దులపల్లి మార్కెట్ ఇన్చార్జి సెక్రటరీ ఈ విషయంపై దరఖాస్తు పెట్టారు. రాష్ట్ర మార్కెటింగ్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొద్దిరోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుంది.