మామిళ్లగూడెం, మార్చి 23 : ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు.
సీ-విజిల్ యాప్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సంఘటనలు జరిగినా వాటి ఫొటోలు, వీడియోలతో సహా సీ-విజిల్ యాప్లో అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.రాజేశ్వరి, మాస్టర్ ట్రైనీ కొండపల్లి శ్రీరామ్, అసిస్టెంట్ మాస్టర్ ట్రైనీ మదన్గోపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.