వేంసూరు :మర్లపాడు గ్రామానికి చెందిన రైతు గొర్ల వెంకట రామ్మోహన్ రెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభ్యుదయ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా శనివారం వైరా కృషి విజ్ఞానకేంద్రంలో అభ్యుదయ రైతు పురస్కారం అందుకున్న రామ్మోహన్ రెడ్డిని శాస్త్రవేత్తలు డాక్టర్ హేమంత్కుమార్ ఆధ్వర్యంలో సత్కరించారు.
వెంకట రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ళుగా కరివేద సాగుపై కృషి విజ్ఞానకేంద్రం సూచనలు, సలహాలతో సాగు చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించానని అందుకు తనను ఈ అవార్డు కు ఎంపిక చేయడం ఆనందంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో రైతుకు గుర్తింపు లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞానకేంద్రం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.