ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 6 : రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెకోడు గ్రామానికి చెందిన కేసనపల్లి శ్రీకాంత్(41) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే ఇంటి నుంచి బయలుదేరిన శ్రీకాంత్ బైపాస్రోడ్లోని కరుణగిరి బ్రిడ్జికి వద్దకు రాగానే వెనుకనుంచి లారీ ఢీకొట్టింది.
తీవ్ర గాయాలపాలైన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి హనుమంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.