తల్లాడ, డిసెంబర్ 4: నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రూ.67 కోట్లు మంజూరైనట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని నూతన్కల్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు గృహంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదు మండలాల ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని గుర్తుచేశారు. తల్లాడ మండలానికి రూ.20 కోట్లు, కల్లూరు మండలానికి రూ.17 కోట్లు, పెనుబల్లి మండలానికి రూ.9 కోట్లు, సత్తుపల్లి మండలానికి రూ.18.60 కోట్లు, వేంసూరు మండలానికి రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. జనవరి తర్వాత పంచాయతీరాజ్ నుంచి మరో రూ.60 కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి అమలయ్యే ప్రతి పథకాన్నీ నియోజకవర్గ ప్రజలకు అందించడమే తన లక్ష్యమని అన్నారు. నిత్యం ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలోని 600 కి.మీ. రోడ్లు మంజూరు చేస్తామన్నారు.
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, శీలం కోటారెడ్డి, నునావత్ కవిత, మాలోతు కల్యాణి, రుద్రాక్షల బ్రహ్మం, కోపెల కనకయ్య, నాయుడు శ్రీనివాసరావు, మువ్వా మురళి, కేతినేని చలపతి, కొండపల్లి చంద్రశేఖర్, జీవీఆర్, ఇనుపనూరి సుదర్శనం పాల్గొన్నారు.