ఖమ్మం/ కామేపల్లి/ రఘునాథపాలెం, మే 8 ;రాష్ట్రంలోని పల్లెలన్నీ ప్రగతి బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఆయన కామేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూ.42.16 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం నగరంలోని 3, 9వ డివిజన్లకు చెందిన నిరుపేదలకు జీవో 58 ఇండ్ల పట్టాలు అందజేశారు. రాపర్తి నగర్లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లె పల్లెకూ రవాణా సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉందన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. పేదల కళ్లలో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలు, నిరుపేదల చిరకాల వాంఛను నెరవేర్చేందుకే 58జీవో పట్టాలు అందజేస్తున్నదన్నారు.
రాష్ట్రంలోని పల్లెలన్నీ ప్రగతి వైపే పయనిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సం క్షేమంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. కామేపల్లి మండలంలో సోమవారం పర్యటించిన ఆయన.. రూ.42.16 కోట్లతో రాయిగూడెం, గోవింద్రాల, పింజరమడుగు, మర్రిగూడెం, పాతలింగాల గ్రామాల్లో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తతండా, నెమలిపురి, హరిశ్చంద్రాపురం గ్రామాల్లో బీటీ రోడ్లను, కొత్తలింగాలలో పైలాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి పల్లెకూ రహదారి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, కాల్వల నిర్మాణం వంటి అనేక పనులను గ్రామాల్లో చేపట్టామని వివరించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే పల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. మనం చేసే పని ధర్మ యుద్ధం లాంటిదని, దీంట్లో మనం తప్పకుండా విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నాయకుల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని, వారి మాటలపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. అనంతరం కోటమైసమ్మతల్లి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
సమగ్రాభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే
గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ప్రతీ గ్రామం అభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెయ్యి మోటర్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బానోత్ సునీత, ధనియాకుల హనుమంతరావు, బోడేపూడి అనురాధ, తీర్థాల చిదంబరరావు, ఆంతోటి అచ్చయ్య, మల్లెంపాటి శ్రీనివాసరావు, దుర్గాజ్యోతి, కృష్ణప్రసాద్నాయక్, బీమానాయక్, జాయ్లూసీ, రాధ, రవి, సుందర్, అనంతరాములు, రాందాస్నాయక్, రాజునాయక్, సునీత, నరసింహారావు, మోహన్రెడ్డి, అప్పారావు, కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, మాధవరావు, హరి, నాగేంద్రబాబు, పాపారావు, శంకర్, విష్ణువర్థన్రెడ్డి, సరిరాంనాయక్, గణేశ్, వీరభద్రరావు, విఠల్రావు, నాగేశ్వరరావు, జగదీశ్, నవీన్, బాబు, రాములు, మంగూ, వీరన్న, సాయన్న, చిన్న వెంకటేశ్వర్లు, బాబు, శ్రీను, లక్ష్మీనారాయణ, రాము, నరసింహారావు పాల్గొన్నారు.
జీవో 58తో పేదల జీవితాల్లో వెలుగులు : మంత్రి
రఘునాథపాలెం, మే 8: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకొని ఎన్నో ఏళ్లుగా ఆధారం లేకుండా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదల కళ్లల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం 58 జీవోకు శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. 3వ డివిజన్ జయనగర్ కాలనీ, 9వ డివిజన్ శ్రీలక్ష్మీనగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు జీవో 58 కింద మంజూరైన ఇళ్ల పట్టాలను సోమవారం ఆయా డివిజన్లలో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. పట్టాలు పంపిణీ చేస్తున్న సమయంలో పేదల మోముల్లో ఆనందాన్ని చూస్తుంటే సంతోషమేస్తోందని అన్నారు. తమకంటూ ఓ ఆస్తి పత్రం లభించిందనే ఆనందాన్ని పేదలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇంకా అర్హులెవరైనా ఉంటే ఈ నెల ఆఖరు వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. 3వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు కొణకంచి వరప్రసాద్, డీసీసీబీ, సుడా చైర్మన్లు నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ శ్వేత, కార్పొరేటర్లు, నాయకులు జ్యోతిరెడ్డి, నాగుల్మీరా, నర్రా ఎల్లయ్య, కాట్రాల శ్రీరాములు, మట్టా సతీశ్, మందనపు నరేశ్, అజ్మీరా వెంకన్న, కుర్రా మాధవరావు, హెచ్ ప్రసాద్, షేక్ సద్దాం, భూక్యా భాషా, గాదె ఉపేందర్, కాట్రాల దినేశ్, దొంగల తిరుపతిరావు, చిలకల వెంకటనర్సయ్య, చిలకల వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవీంద్రనాథ్, అర్బన్ తహసీల్దార్ శైలజ, గిర్దావర్లు రమేశ్, రవి పాల్గొన్నారు.