రేషన్ డీలర్ల శిక్షణలో అదనపు కలెక్టర్ మధుసూదన్
ఖమ్మం, జూన్ 25: నూతన ఈ-పాస్ మిషన్లలో 4జీ సేవలు ఉన్నందున ఇక నుంచి రేషన్ డీలర్లకు లావాదేవీల్లో ఇబ్బందులుండవని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. నూతన ఈ-పాస్ మిషన్ల పంపిణీ, శిక్షణపై వివిధ మండలాల రేషన్ డీలర్లతో ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ మిషన్లతో ఇబ్బందులు తొలగిపోతున్నందున ప్రభుత్వం అందజేసే సరుకులను లబ్ధిదారులకు సకాలంలో అందజేయాలని సూచించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మిషన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. డీఎస్వో రాజేందర్, డీటీలు విజయ్బాబు, సురేందర్, నిస్సార్ అహ్మద్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు బాణోత్ వెంకన్న, జానిమియా, దర్గయ్య ఇబ్రహీం, మహేశ్, విష్ణువర్ధన్రెడ్డి, రాఘవరావు, కవిత, వెంకటనారాయణ, వినోద్ పాల్గొన్నారు.