ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2కే రన్ ఉత్సాహంగా కొనసాగింది. భారత స్వతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా గురువారం నిర్వహించిన ‘2కే రన్’కు యువతీ యువకులు, ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. మణుగూరు సింగరేణి ఏరియాలో అధికారులు 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. తల్లాడ మండలం రెడ్డిగూడెంలో విద్యార్థులు 330 అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. ‘మేరా భారత్ మహాన్, జై జవాన్.. జైకిసాన్ ’ నినాదాలతో ఉమ్మడి జిల్లా మార్మోగింది. ఖమ్మం నగరంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సీపీ విష్ణు ఎస్ వారియర్ క్రీడాజ్యోతి వెలిగించారు. మణుగూరు పట్టణంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పట్టణవాసులతో కలిసి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలో జరిగిన ‘రన్’లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య రన్లో పాల్గొన్నారు.
ఖమ్మం, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహలో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘2కే రన్’ జరిగింది. ఖమ్మం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సీపీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ప్రారంభమైన పరుగు లకారం ట్యాంక్బండ్ వరకు చేరుకున్నది. జడ్పీ చైర్మన్, సీపీ క్రీడాజ్యోతిని వెలిగించారు. వందలాది మంది యువతీ యువకులు రన్లో పాల్గొన్నారు. సత్తుపల్లి జ్యోతి నిలయం పాఠశాల నుంచి పాతసెంటర్ వరకు ‘రన్’ జరిగింది. ఏసీపీ వెంకటేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, సీఐ కరుణాకర్ పాల్గొన్నారు.
మధిరలో నిర్వహించిన ‘రన్’లో సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ముజాహిద్ పాల్గొన్నారు. చింతకానిలో ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ సభ్యుడు తిరుపతి కిశోర్, బూర్గంపహాడ్ మండలం సారపాక కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పాల్గొన్నారు. మణుగూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పూల మార్కెట్ సెంటర్ వరకు ‘రన్’ జరిగింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పట్టణవాసులతో కలిసి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. మణుగూరు సింగరేణి ఏరియాలో అధికారులు 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలో జరిగిన ‘రన్’లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. దుమ్ముగూడెం, తల్లాడ, వైరా, టేకులపల్లి, ఇల్లెందు, కల్లూరుతో పాటు ఇతర మండల కేంద్రాల్లో నిర్వహించిన ‘రన్’లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.