మధిర ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్
కొవిడ్ కేర్, ఐసోలేషన్ కేంద్రాల ప్రారంభం
మధిర రూరల్, మే 18: నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొవిడ్ నియంత్రణ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం మధిర ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సీజన్తో కూడిన 20 బెడ్లతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును ఆయన ప్రారంభించారు. అదేవిధంగా మధిరలోని కృష్ణాపురం స్రమీపంలో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయంలో 100 బెడ్లతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రిగా జిల్లాలో కొవిడ్ నియంత్రణ కోసం ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, డీఎంహెచ్వో మాలతి; వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.