ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయం
అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే టీఆర్ఎస్లోకి వలసలు
30 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరికల సభలో జడ్పీ చైర్మన్
చింతకాని, అక్టోబర్ 13: పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే సబ్బండ వర్గాలకూ న్యాయం జరుగుతోందని, అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయని అన్నారు. మండలంలో కోదుమూరు గ్రామంలోని పలు పార్టీలకు చెందిన 30 కుటుంబాల వారు బుధవారం జడ్పీ చైర్మన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ జడ్పీ చైర్మన్ గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్డీఎఫ్ నిధుల ద్వారా మధిర నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, రైతుబంధు సమితి సభ్యుడు మంకెన రమేశ్, కార్యదర్శి బోడ్డు వెంకట్రామారావు, మాజీ ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, నాయకులు బోగ్గారపు రాంబాబు, దాసరి వెంకటేశ్వర్లు, చిట్టిమోదు రాంబాబు, గుదిమళ్ల నాగరాజు, రేగళ్ల రాంబాబు, బందెల అశోక్ పాల్గొన్నారు.