ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 20: ఖమ్మం త్రీటౌన్కు గుండెకాయ లాంటి వ్యవసాయ మార్కెట్ను ఇక్కడి నుంచి తరలించేందుకు కొందరు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తే.. అది తరలిపోకుండా తాను కావలికాశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఖమ్మం ఏఎంసీ కార్మికులను కూడా తాను కంటికి రెప్పలా కాపాడుకున్నానని వివరించారు. బీఆర్ఎస్కేవీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కార్మిక నేత, ట్రాలీ వర్కర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నున్నా మాధవరావు అధ్యక్షతన ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. గతంలో అనేకమంది నాయకులు ఈ మార్కెట్ను వేరే ప్రాంతానికి తరలించేందుకు విశ్వప్రయత్నం చేశారని గుర్తుచేశారు. కానీ తాను వారి కుట్రలను తప్పికొట్టి మార్కెట్ను కాపాడుకున్నానని అన్నారు. అంతేగాక మార్కెట్ అభివృద్ధికి ఏకంగా రూ.10 కోట్ల నిధులను మంజూరు చేశానని, అభివృద్ధి పనులు ప్రారంభించానని వివరించారు.
కాంగ్రెస్ నాయకులు ఖమ్మంపై కపట ప్రేమను చూపుతున్నారని, ఖమ్మం నియోజకవర్గం వారికి రెండో ప్రాధాన్యం మాత్రమేనని విమర్శించారు. కానీ ఇక్కడే పుట్టి ఒక్కడే పెరిగిన తాను ఖమ్మాన్నే మొదటి ప్రాధాన్యంగా భావించి వందల కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దానని వివరించారు. కార్మికుల కుటుంబాల వారంతా తమ చుట్టుపక్కల వారికి ఖమ్మం అభివృద్ధి గురించి వివరించాలని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి మెజార్టీ అందేలా చూడాలని కోరారు. అనంతరం, ఈ ఎన్నికల్లో మంత్రి పువ్వాడకే మద్దతు ఇస్తున్నట్లు ట్రాలీ వర్కర్స్, హమాలీ, దడవాయిలు, రైస్మిల్, దాల్మిల్ తదితర అసోసియేషన్ల కార్మికులంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తదుపరి మంత్రి అజయ్కు హామీ ఇచ్చి ప్రతిజ్ఞ చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, వివిధ సంఘాల నాయకులు కూరాకుల నాగభూషణం, పునుకొల్లు నీరజ, పగడాల నాగరాజు, చిన్ని కృష్ణారావు, బచ్చు విజయ్కుమార్, తోట వీరభద్రం, మన్నెం కృష్ణ, ముత్యం ఉప్పల్రావు, ఎర్రా అప్పారావు, గీతా వెంకన్న, పత్తిపాక రమేశ్, మరాటి యాదయ్య, సైదిరెడ్డి, మోటె కుమార్, కోడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 20: ఖమ్మం ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడేలా పని చేశానని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలనూ ప్రజల ఇంటికి వెళ్లి చేరవేశానని గుర్తుచేశారు. ఖమ్మం 10వ డివిజన్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిని మాత్రమే కాంక్షించానని, రాష్ట్ర మంత్రిగా ఉన్న కూడా ఖమ్మం అభివృద్ధిపైనే అత్యధిక ఫోకస్ పెట్టానని, హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దానని వివరించారు. పునుకొల్లు నీరజ, కూరాకుల నాగభూషణం, రమాదేవీ సతీశ్, పాషా, వంగవీటి శ్రీను, పారా నాగేశ్వరరావు, దిలీప్, జాబిశెట్టి శ్రీనివాస్, అప్పారావు, పగడాల నాగరాజు పాల్గొన్నారు.