మధిర, ఆగస్టు 19: వచ్చే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ స్థానాన్ని గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని 11, 12 వార్డుల్లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 200 కుటుంబాల వారు శనివారం బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావులు.. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ గద్దల మాధురి నాని అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన దళితవాడలను సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. మధిర ఎమ్మెల్యే ఏనాడూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు గురించి ఆలోచించలేదని విమర్శించారు. మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న తరువాతే టనిధులు వెచ్చించి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.కోటి నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల మరో రూ.30 కోట్లు కేటాయించారని, వాటి ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, బిక్కి కృష్ణప్రసాద్, చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, కరివేద సుధాకర్, కపిలవాయి జగన్మోహన్రావు, జిల్లేపల్లి బాబురావు, మంకెన రమేశ్, తిరుపతి కిశోర్, మునుగోటి వెంకటేశ్వర్లు, ముత్తారపు ప్యారీ, యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, గద్దల రాజా, వంకాయలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.