ఖమ్మం, ఏప్రిల్ 30 (న మస్తే తెలం గాణ ప్రతి నిధి) : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నా యని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను గెలిచి తీరాలన్నారు. మంగళవారం కొత్త గూడెం రోడ్ షో అనంతరం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి లోని ముఖ్య నాయకులతో ఇల్లెందు అతిథి గృహంలో సమావేశమయ్యారు. “మనకు సానుకూల వాతావరణం ఉంది.
కాంగ్రెస్ను, బీజే పీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇక్కడి రెండు ఎంపీ స్థానా లను గెలిపించు కోవాలి” అని అన్నారు. సమావేశంలో ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజ య్ కు మార్, పార్టీ రెండు జిల్లాల అధ్య క్షులు రేగా కాంతా రావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, ఎంపీ అభ్య ర్థులు నామా నాగే శ్వ ర రావు, కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, నాయకుడు దిండి గల రాజేందర్ పాల్గొ న్నారు.