ఖమ్మం జిల్లాకు ఘనమైన కీర్తి ఉందని, పరిపాలన అద్భుతంగా సాగుతున్నదని, అనేక విజయాలను సాధించామని, ఇది అధికారుల కృషితో సాధ్యమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్లోని ఐడీవోసీలోని సమావేశ మందిరంలో మంగళవారం మంత్రి అధికారులతో దశాబ్ది ఉత్సవాలపై సమీక్షించారు. నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు.
– ఖమ్మం, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలను జిల్లాలో అంబరాన్నంటేలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఐడీవోసీలోని సమావేశ మందిరంలో అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు ఘనమైన కీర్తి ఉన్నదని, పరిపాలన అద్భుతంగా సాగుతున్నదని, అనేక విజయాలను సాధించామని, ఇది అధికారుల కృషితో సాధ్యమైందని అన్నారు. నాడు తెలంగాణ సాధనలో ఉద్యోగులు సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్షను రగిల్చారని, సాధించిన తెలంగాణలో అభివృద్ధికి అదే ఆకాంక్షతో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒకరికి ఉందని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని అన్నారు. ఉత్సవాలను 21రోజులపాటు నిర్వహించనున్నామని ఏర్పాట్లకు ఎక్కడా లోటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జూన్ 2న అమరవీరులకు నివాళులర్పించి, ఐడీవోసీ లో పతాకావిషరణ ఉంటుందని, సాయంత్రం లకారంలో సాంసృతిక కార్యక్ర మాలు ఉంటాయని తెలిపారు.
జూన్ 3న రైతుల దినోత్సవాన్ని పురసరించుకుని జిల్లాలోని 129 రైతువేదికల్లో పెద్దఎత్తున రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రైతువేదిక క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, ద్విచక్రవాహనాలపై ఊరేగింపుగా రైతువేదికకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని, రైతులకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ తదితరాలపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నది, పథకాలకు పూర్వం పరిస్థితి, ఇప్పటి పరిస్థితిపై అవగాహన కల్పించాలన్నారు. రైతుబీమా పొందిన కుటుంబంతో వారు పొందిన లబ్ధిని వారితోనే చెప్పించాలన్నారు. ముందస్తు సాగు, పంటల మార్పిడిపై రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. జూన్ 4న సురక్షా దినోత్సవం జరపాలని, ప్రజలకు షీ టీమ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, ర్యాలీలు చేపట్టాలని, మంచి పౌరులు, విశిష్ట సేవలందించిన పోలీసులను సతరించాలని అన్నారు. జూన్ 5న విద్యుత్ దినోత్సవం పురసరించుకుని సబ్స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాలు అలంకరించాలని, తెలంగాణకు పూర్వం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, ఇప్పుడు పరిస్థితిపై, విద్యుత్రంగంలో ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
జూన్ 6న పారిశ్రామిక ఉత్సవాన్ని పురసరించుకుని జిల్లాస్థాయిలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి పారిశ్రామికరంగంలో సాధించిన ప్రగతిని తెలియజేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల సంఘాలు, అసోసియేషన్లను వేడుకలకు ఆహ్వానించాలన్నారు. జూన్ 7న సాగునీటి దినోత్సవాన్ని పురసరించుకుని నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టి, సాగునీటి రంగంలో రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచాలన్నారు. జూన్ 8న చెరువుల పండుగను పురసరించుకుని గ్రామగ్రామాన చెరువుల వద్ద సాంసాృతిక కార్యక్రమాలు చేపట్టాలని, కట్టలపై భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 9న తెలంగాణ సంక్షేమ సంబరాలను పురసరించుకుని రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవం ఉంటుందని, సాంఘిక సంక్షేమశాఖతో సేకరించిన 58 ఎకరాల భూమిని, ఇండ్లు లేని 3 వేల మందికి పట్టాల పంపిణీ చేయనున్నట్లు, బీసీ సంక్షేమశాఖ ద్వారా బీసీలకు చెకుల పంపిణీ, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ల తదితర లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు.
జూన్ 10న సుపరిపాలన దినోత్సవాన్ని పురసరించుకుని కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల దగ్గర సంబరాలు చేపట్టాలని, కొత్తగా ఏర్పాటుతో కల్గిన ప్రయోజనాలను కరపత్రాల రూపంలో ప్రచురించి ప్రజలకు వివరించాలన్నారు. జూన్ 11న సాహిత్య దినోత్సవాన్ని పురసరించుకుని భక్త రామదాసు కళాక్షేత్రంలో కవి సమ్మేళనం, కవితల పోటీలను నిర్వహించాలని పేర్కొన్నారు. జూన్12న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ను చేపట్టాలని సూచించారు. జూన్ 13న మహిళా సంక్షేమ దినోత్సవం పురసరించుకుని మహిళా ఉద్యోగినులకు సన్మానం చేయాలని, మహిళల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు. జూన్ 14న వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని పురసరించుకుని వైద్య రంగంలో ఆనాటి సౌకర్యాలు, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి, పల్లె, బస్తీ దవాఖానలు, ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు, ఆరోగ్య మహిళ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జూన్ 15న పల్లెప్రగతి దినోత్సవం పురసరించుకుని గ్రామాల్లో సౌకర్యాల కల్పనపై ప్రజలకు వివరించాలని, నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఉత్తమ సర్పంచులు, ఎంపీపీలకు సన్మానాలు చేయాలన్నారు. జూన్ 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం పురసరించుకుని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 9 సంవత్సరాల ప్రగతిని ప్రజలకు వివరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జూన్ 17న గిరిజనోత్సవం పురసరించుకుని గిరిజన గ్రామాల్లో 10శాతం రిజర్వేషన్లు, గిరివికాసంతో లబ్ధిపై అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తండాలు, గిరిజన గూడేల అభివృద్ధిని అక్కడి ప్రజలకు వివరించాలన్నారు. జూన్ 18న మంచినీళ్ల పండుగను ఘనంగా చేపట్టాలని, మిషన్ భగీరథ ద్వారా సాధించిన తాగునీటి విజయాలపై సభలు నిర్వహించాలన్నారు. జూన్ 19న హరితోత్సవాన్ని పురసరించుకుని పెద్దఎత్తున మొకలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. జూన్ 20న తెలంగాణ విద్యా దినోత్సవం పురసరించుకుని మన ఊరు- మన బడి కార్యక్రమ పనులు పూర్తితో పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమాలు చేయాలని, పిల్లలకు యూనిఫాం, పుస్తకాల పంపిణీ చేయాలన్నారు. వ్యాసరచన, ఉపన్యాసాలు, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించాలన్నారు. జూన్ 21న ఆధ్యాత్మిక దినోత్సవం పురసరించుకొని, ఆలయాలు, మసీదులు, చర్చిలను అలంకరించాలని, ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేపట్టాలని తెలిపారు.
జూన్ 22న అమరులకు నివాళులు, స్మారక చిహ్నాల ప్రారంభోత్సవం చేయాలని తెలిపారు. గ్రామ, మండల, మున్సిపల్, జిల్లా పరిషత్ స్థాయిల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, అమరులకు నివాళి తీర్మానం, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 2 నిమిషాలు మౌనం పాటించాలని మంత్రి సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉత్సవాలు వైభవంగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ అధికారులకు వేడుకల నిర్వహణపై అవగాహన కల్పించినట్లు, సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధికగుప్తా, మయాంక్ సింగ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ ఘట్టాలను ప్రదర్శించాలి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను 21రోజులు ఘనంగా నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఉద్యమ సమయంలో ఘట్టాలను ప్రధాన కూడళ్లలో ప్రదర్శించాలని, 2014కు పూర్వం, 2014 తర్వాత సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తొమ్మిదేండ్లలో జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను ప్రజలకు తెలపాలని అన్నారు.
తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించాలి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
తెలంగాణ సాధనకు చేపట్టిన స్ఫూర్తిని, సాధించిన తెలంగాణ అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశమై వేడుకలు పెద్దఎత్తున ఘనంగా చేపట్టేందుకు కార్యాచరణ చేసినట్లు తెలిపారు. వేడుకలను గొప్పగా జరుపుకోవాలన్నారు.