వేములవాడ/సిరిసిల్ల టౌన్, మార్చి 3: ఐదేండ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సోమ, మంగళ వారాల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరికీ చుక్కల మం దు వేయించాలన్నారు. ఇక్కడ పల్స్పోలియో ప్రోగ్రాం రాష్ట్ర పరిశీలకుడు గోపాలకృష్ణ, డబ్ల్యూహెచ్వో కోఆర్డి నేటర్ అతుల్నిగమే, ఇన్చార్జి డీఎంహెచ్వో రజి త, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీరాములు, ప్రోగ్రాం అధి కారులు ఉమ, నయీం, జహ, సీడీపీవో అలేఖ్య, వైద్యాధికారి ప్రియాంక పాల్గొన్నారు.
lవేములవాడ పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రామ తీర్థపు మాధవి ప్రారంభించారు. చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసి మహమ్మారిని తరిమివేద్దామని కోరారు. రాజన్న ఆలయ పరిసరాల్లో ఈవో కార్యాలయం, లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద, బస్టాండ్లో కూడా శిబిరాలను ఏర్పాటు చేశామని అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి దివ్యశ్రీ తెలిపారు. ఇక్కడ కౌన్సిలర్ సిరిగిరి రామ్చందర్, సూపర్వైజర్ ఝాన్సీమణి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/ముస్తాబాద్/వీర్నపల్లి/ చందుర్తి/కోనరావుపేట/ఇల్లంతకుంట/ సిరిసిల్ల రూరల్, మార్చి 3: చిన్నారుల నిండు జీవితానికి తప్ప నిసరిగా రెండు చుక్కల పోలియో మందు వేయించాల ని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్లో జడ్పీటీసీ లక్ష్మణ్రావు, అల్మాస్పూర్లో ఎంపీపీ పిల్లి రేణుక, దుమాలలో వైస్ఎంపీపీ కదిరె భాస్కర్, ఎల్లారెడ్డిపేట లో పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, గంభీరావు పేట మండలం గోరంటాలలో జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ ప్రారంభించారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీ సీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరె డ్డి, వీర్నపల్లి మండలంలో పలువురు నాయకులు, చందుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ బైరగోని లావణ్య, జడ్పీటీసీ నాగం కుమార్, వైద్యా ధికారి సంపత్కుమార్, కోనరావుపేట మండలం ధర్మా రం, మల్కపేట గ్రామాల్లో మండల వైద్యాధికారి వేణు మాధవ్, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, తంగళ్ల పల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పడిగెల మానస, ఇల్లంతకుంటలో వైద్యాధికారి శరణ్య, పొత్తూరులో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, అనంతారంలో జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి రజిత, వంతడుపులలో వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్గౌడ్, రుద్రంగి మండల కేం ద్రంతోపాటు మానాలలో వైస్ ఎంపీపీ పీసరి భూ మయ్య, వైద్యాధికారి సంతోష్కుమార్, సిరిసిల్ల మున్సి పల్ విలీన గ్రామాల్లో కౌన్సిలర్లు చిన్నారులకు పోలి యో చుక్కలు వేసి శిబిరాలను ప్రారంభించారు.