Hanging | కాల్వశ్రీరాంపూర్, మార్చి26 : ఉరేసుకుని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇద్దులాపూర్ గ్రామానికి చెందిన అంబాల కుమార్ (35) గురువారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకున్నారు. భార్య వసంత గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది.
దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఆదిత్య, అక్షయ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపాడు. కుమార్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.