కోనరావుపేట మండల వ్యాప్తంగా యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు పొలాల్లో వరినాట్లు వేయడంలో బిజీబిజీగా మారారు.
గ్రామాల్లో ఎక్కడ చూసినా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలకు చెందిన కూలీలు వలస వచ్చి నాట్లు వేస్తున్నారు. స్థానికంగా కూలీల కొరత ఉండడం, ఎక్కువ కూలి అడుగుతుండడంతో వలస కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. దీంతో వరినాట్లు ఊపందుకున్నాయి.