కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 9 : సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ గుర్తింపు కా ర్మిక సంఘం టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘా లు ఇచ్చిన సమ్మె గురువారం తొలిరోజు విజయవం తమైంది. సంస్థ వ్యాప్తంగా 11 ఏరియాల్లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రీ షిఫ్ట్ నుంచి అన్ని భూగర్భ గనులు, ఓపెన్కాస్టు గనులు, డిపార్ట్మెం ట్ల వద్ద నిరసన చేపట్టారు. కార్పొరేట్ కార్యాలయం వద్ద కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఆందోళన కు దిగారు. సింగరేణిలోని అన్ని జీఎం కార్యాలయా లు, కొత్తగూడెంలోని కార్పొరేట్ ప్రధాన కార్యాల యం హెడ్డాఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. భో జన విరామ సమయం వరకు ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్కు అప్పగిస్తే సంస్థకే నష్టం కాదని, బొగ్గు ఆధారిత పరిశ్రమల న్నింటిపై ప్రభావం చూపుతుందన్నారు. విద్యుత్ సంస్థలకు పెద్దఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉం దన్నారు. కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు బొగ్గు బ్లా కులు అందిస్తే వారు ఇష్టానుసారంగా ధరలు పెం చుతారని పేర్కొన్నారు. భవిష్యత్లో కార్మికుల సం ఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. కారుణ్య ని యామకాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. సిం గరేణి కార్మికులకు జీతాలు తప్ప ఎలాంటి అలవె న్సులు వర్తించవని, ఉద్యోగ భద్రత ఉండదని, సీ ఎంపీఎఫ్ వర్తించదని, దవాఖాన సౌకర్యం ఉండ దని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతు చట్టాలను ఎలా రద్దు చేసిందో.. అలా రద్దు చేసే వ రకూ పోరాటం ఆగదన్నారు. కార్మికులకు క్షమాపణ చెప్పి సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇచ్చే వరకూ కా ర్మికులు పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సమ్మెలో 29,247 కార్మికులు..
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో నిర్వ హించిన సమ్మెలో మొదటి రోజు మొత్తం మొదటి షిఫ్ట్లో 27,559 మంది కార్మికులకు గాను 3,410 మంది అత్యవసర సేవలకు హాజరయ్యారు. 23,388 మంది సమ్మెలో పాల్గొన్నారు. రెండో షి ఫ్ట్లో 7,218 మంది కార్మికులకు గాను 1,215 మంది అత్యవసర సేవలకు హాజరయ్యారు. 5,866 మంది సమ్మెలో పాల్గొన్నారు. మొదటి, రెండో షిప్టుల్లో 34,777 మంది కార్మికులకు గాను 4,620 మంది హాజరయ్యారు. 29,247 మంది సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం సంస్థ వ్యాప్తంగా 2 లక్షల ట న్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని విలువ రూ.80 కోట్లు ఉంటుంది. కార్మికులు వేతనాల రూ పంలో రూ.20 కోట్లు నష్టపోయారు.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఇలా..
కొత్తగూడెం ఏరియా 56,944 టన్నులు, ఇల్లెం దు ఏరియా 20,038, మణుగూరు ఏరియా 38, 963 టన్నులు, ఆర్జీ1 ఏరియా 13,196 టన్నులు, ఆర్జీ2 ఏరియా 25,943 టన్నులు, ఆర్జీ3 ఏరియా 21,481 టన్నులు, అడ్రియాల ప్రాజెక్టు 6,926 టన్నులు, భూపాలపల్లి ఏరియా 15,815 టన్ను లు, బెల్లంపల్లి 12,037 టన్నులు, మందమర్రి ఏరి యా 18,604 టన్నులు, శ్రీరాంపూర్ ఏరియా 21, 833 టన్నుల బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిం ది. రెండో రోజూ ఇదే పరిస్థితి నెలకొననుంది.
జిల్లాలోని ఏరియాల్లో..
కార్మికలోకం కదం తొక్కింది. సింగరేణి 4బొగ్గు బ్లాకుల వేలం వ్యతిరేకిస్తూ 72గంటల సమ్మెలో భాగంగా మొదటిరోజు విజయవంతమైంది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సం ఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎం ఎస్, బీఎంఎస్, సీఐటీయూ సంఘాలు తలపెట్టిన సమ్మెకు కార్మికుల నుంచి విశేష స్పందన వ్యక్తమైంది. కార్మికులు విధులకు దూరంగా ఉం డగా, ధర్నాలు, ఆందోళనలతో సింగరేణి ప్రాంతం అట్టుడికిపోయింది. ఆర్జీ-1 ఏరియా వర్క్షాపు, ఇతర డిపార్ట్మెంట్లలో కార్మికులు విధులకు హాజరుకాలేదు. ఉదయమే టీబీజీకేఎస్తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు గనులపైకి వచ్చారు. బైక్ ర్యాలీలు తీసి గనుల వద్దకు వచ్చి ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జీడీకే-1, 2, 2ఏ, జీడీకే-5 ఓసీపీ, మేడిపల్లి ఓసీపీ-4, జీడీకే-11గనులపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరాటం చేస్తామని చెప్పారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని అప్పటి వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఇక్కడ టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్రావు, నాయకులు కనకం శ్యాంసన్, జావిద్పాషా, వడ్డేపల్లి శంకర్, ఎల్ వెంకటేశ్, దేవ వెంకటేశం, సత్యనారాయణ, కృష్ణమూర్తి, పుట్ట రమేశ్, గంగాధర్, శేషగిరి, కుశనపల్లి శంకర్, బాలయ్య, మల్లారెడ్డి, పర్లపల్లి రవి, ఎడవెల్లి రాజిరెడ్డి, రమేశ్రెడ్డి, మల్లయ్య, నర్సయ్య, నాయిని శంకర్, చెల్పూరి సతీశ్, గండ్ర రాజు పాల్గొన్నారు. జాతీయ సంఘాల నాయకులు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సీఐటీయూ నాయకులు తుమ్మల రాజారెడ్డి, బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య పాల్గొన్నారు.
ఆర్జీ-2లో
ఆర్జీ-2లో సమ్మె విజయవంతమైంది. కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఇంటికే పరిమితం కావడంతో గనులు బోసిబోయాయి. సమ్మె ప్రభావంతో గనుల్లో హాజరు శాతం దాదాపు 90శాతం తగ్గిపోగా అత్యవసర విభాగాల్లో మాత్రమే కార్మికులు విధులకు హాజరయ్యారు. సమ్మె ప్రభావంతో ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3, వకీలుపల్లిగనిలో ఉత్పత్తి విఘాతం కలిగింది. ఓసీపీ-3 ప్రాజెక్టులో భారీ యంత్రాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఆర్జీ-2 ఏరియా ఉత్పత్తిలో కీలకమైన ఓసీపీ-3 మొదటి షిఫ్టులో 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలిగింది. ఐక్య కార్మిక సంఘాలు గనులపై, కార్మిక వాడల్లో భారీ ర్యాలీ తీసి అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్రం దిగి రావాలని, న్యాయమైన తొమ్మిది డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇక్కడ జేఏసీ నాయకులు ఐలి శ్రీనివాస్, రాజరత్నం, ఎస్కె. అక్బర్ ఆలీ, సత్యనారాయణరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, బేతి చంద్రయ్య, ఆకుల రాజిరెడ్డి, ముస్కుల అనిల్ రెడ్డి, అన్నారావు, శ్యాంసన్, ఎల్ ప్రకాశ్, హమీద్, సంజీవకుమార్, తమ్మిశెట్టి రామకృష్ణ ఉన్నారు.
ఆర్జీ-3లో..
రామగుండం మూడో రీజియన్లో సమ్మె విజయంతమైంది. కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో ఉపరితల బొగ్గు గనులు బోసిపోయాయి. ఓసీపీ-2లోని ఎన్సీసీ ప్రైవేటు కంపెనీలో పనులు నిలిపివేయించేందుకు వెళ్లిన టీబీజీకేఎస్ నాయకులు గౌతం శంకరయ్య, దేవ శ్రీనివాస్, దాసరి మల్లేశ్, పూసాల శేఖర్, రమేశ్, జనగామ రమేశ్లను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, తొలి రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు జేఏసీ కార్మిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు సైతం పాల్గొని సమ్మెను విజయవంతం చేశారనీ, ఇదే స్ఫూర్తితో సమ్మెలో పాల్గొని కేంద్రానికి గుణపాఠం చెప్పాలని ఐఎఫ్టీయూ నాయకులు ఏ వెంకన్న పిలుపునిచ్చారు. ఇక్కడ అశోక్, నర్సయ్య, లక్ష్మి, రాధ, రజిత, రమేశ్, మోహన్, నాగరాజు, మొండయ్య, కనకలక్ష్మి, శాంత, అరుణ రాజయ్య, రవీందర్ ఉన్నారు.