Former Minister Jeevan Reddy | జగిత్యాల, నవంబర్ 24 : విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం ఇందిరా భవన్ లో విశ్రాంత ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నూతన కార్యవర్గానికి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విశ్రాంత ఉద్యోగస్తుల సమస్యలు తెలిపారు. విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యలపై సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులతో పాటుగా విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ప్రధాన పాత్ర పోషించారన్నారు.
ఆనాడు సకలజనుల సమ్మెలో భాగంగా యావత్ తెలంగాణ సమాజం రాజకీయాలకతీతంగా ఉద్యమించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏమైతే ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నామన్నారు. మన రాష్ట్రం మనకు ఏర్పాటైతే మనం స్వరాష్ట్రంలో ఆశయాలు ఆకాంక్షలు హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుందని, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడం ఆనాడు చైర్ పర్సన్ సోనియా గాంధీ రాజకీయంగా ఒరిదుడుకులు ఎదుర్కొన్న గాని ఆంద్రప్రదేశ్ లో పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చటం ప్రధాన బాధ్యతగా భావించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆనాడు 2014లో కేసీఆర్ కి అవకాశం వచ్చిందన్నారు.