కోనరావుపేట, డిసెంబర్ 16: భర్త లేని లో కంలో ఉండలేక భార్య తనువు చాలించింది. అతడి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి బండి నవీన (22) కొన్నేండ్ల క్రితం అదే గ్రా మానికి చెందిన బండి ప్రశాంత్ను ప్రేమ వివా హం చేసుకుంది. ప్రశాంత్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
ఈ క్రమంలో ప్రశాంత్ నెల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దవాఖనలో చేరగా వై ద్యులు పరీక్షలు నిర్వహించి పచ్చకామెర్లు అని నిర్ధారించారు. కరీంనగర్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో తన భార్య అయిన నవీన ప్రే మించి పెళ్లి చేసుకున్న ఈ లోకంలో తన భర్త లేడని మనోవేదని చెంది ఈనెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డది. ఈక్రమంలో గమనించిన కుటుంబ సభ్యులు హుటహుటినా ఎల్లారెడ్డిపేట లోని ఓ హాస్పిటల్కు త రలించారు. శుక్రవారం మధ్యాహ్నం సమయం లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలికి కూతురు శ్రేష్ట 14నెలల పాప ఉంది. దీంతో మృతురాల తండ్రి పని నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.