వీణవంక, ఫిబ్రవరి 18: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద ర్ రానున్న ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే భరోసా యాత్ర చేస్తున్నారని ఉపసర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మండలంలోని లస్మక్కపల్లి గ్రా మంలో శుక్రవారం జరిగిన బీజేపీ భరో సా కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలను ఖండించారు. శనివారం మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనం ఆవరణలో ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లస్మక్కపల్లి గ్రామ శివారులో అవగాహన లే కుండా చెక్డ్యాం నిర్మాణం చేపట్టిన ఈటల రాజేందర్ రైతులు భూములు కోల్పోతున్నామని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా సీసీ రోడ్లు, డ్రైనేజీ వేస్తానని వేయలేదు, పెన్షన్లు ఇప్పిస్తానని ఇప్పించని నీకు బీజేపీ భరోసా యాత్ర ఎందుకని ప్రశ్నించారు. వరిధాన్యం కొనుగోళ్ల గురించి రైతు లు వచ్చి బాధలు చెప్పుకుంటే పట్టించుకోలేదని ఈరోజు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి చొరవతో మిల్ల ర్లు సజావుగా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు రుణాలు చెల్లించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా చెక్కులు అందజేయడం జరిగిందని, నియోజకవర్గంలోని మహిళలను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.
జమ్మికుంట లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీని ప్రజల్లో తిరగాలని చెప్పిన దగ్గర నుంచి ఈటల రాజేందర్కు భయంపట్టుకుందని, రాజకీయ లబ్ధికోసమే ప్రజాగోస యాత్ర నాటకాలు ఆడుతున్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలని కళ్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే రానున్న రోజుల్లో గ్రామాల్లో తిరక్కుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గోపు వెంకట్రెడ్డి, లింగాల కిషన్రెడ్డి, మర్రి సంపత్, దాసారపు శ్రీనివాస్, గెల్లు సమ్మయ్య, బొంకూరి రాజయ్య, లక్ష్మణ్, రవి, శంకర్, గణేశ్ పాల్గొన్నారు.