KOPPULA ESWAR | పెగడపల్లి: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించాలని, దీనికి గాను పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలం వెంగలాయిపేట గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో వెంగలాయిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం కు నిధుల కేటాయింపు తో పాటు, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం వంటి లక్షలాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు అభివృద్ధిని వివరిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు రాబట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.