వెల్గటూర్, ఆగస్టు 16: ‘సాగుకు మూడు గంటల కరెంట్ చాలంటున్న రేవంత్రెడ్డి.. ముక్కిపోయిన కాంగ్రెస్ను పట్టుకుని అధికారం కోసం ఆరాట పడుతున్నడు. కానీ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కోసం మేం పోరాటం చేస్తున్నాం’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. శనివారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, పడకల్, కొత్తపేటలో ప్రజా ఆశీర్వదయాత్ర చేపట్టారు.
మొదట రాజారాంపల్లి హనుమాన్ ఆలయంలో పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పడకల్, కొత్తపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేస్తూ 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో అవకాశం ఇవ్వాలని వస్తున్నారని, అలాంటి వారికి అవకాశం ఇస్తే మరో 50 ఏండ్లు వెనుకకు పోవాల్సి వస్తుందన్నారు.
3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే కేరాఫ్ తెలంగాణ రాష్ట్రం అనే విధంగా సీఎం కేసీఆర్ తయారు చేశారని గుర్తు చేశారు. కండ్లు లేని కాంగ్రెస్, సోయి లేని బీజీపీ నాయకులకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనబడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, బీజేపీకి క్యాడర్, పోటీ చేసే క్యాండిడేట్ లేరని ఎద్దేవా చేశారు.
కొందరు నాయకులు ఉద్యోగాల కోసం యువతను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అన్ని వేళల అందుబాటులో ఉండే, కుటుంబ సభ్యునిగా ఉన్న తనను మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పునరుద్ఘాటించారు. కొందరు నాయకులు ఉద్యోగాల కోసం యువతను రెచ్చగొడుతున్నారు. వారి కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 2 లక్షల 20 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కేటీఆర్ నాయకత్వంలో ప్రపంచంలోని ప్రముఖ కంపనీలను తీసుకు వచ్చి ఐటీ హబ్ తెలంగాణను మార్చి 18 లక్షల ఉద్యోగాలు కల్పించారని అన్నారు.
మీకు అన్ని వేళల అందుబాటులో ఉండే మీ కుటుంబ సభ్యున్ని ఏనాడు మంత్రిగా కాకుండా సాధరణ వ్యక్తిగా ఉంటూ మీకు సేవలు అందించాను, ‘మరో సారీ ఆశీర్వదించండి మరింత అభివృద్ది చేస్తూ, మీమ్ములను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా’నని పునరుద్ఘాటించారు. గ్రామాల్లో చేపట్టిన ప్రజా ఆశీర్వద యాత్రలో మహిళలు, నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పలుకుతున్న స్వాగతం విజయ యాత్రను తలపించింది. పడకల్ వెళ్ళే దారిలో మహిళ రైతు కూలీలతో కాసేపు మాట్లాడారు. పడకల్లో మైనారిటీ బంధు కింద ముగ్గురికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు.
అంతకు ముందు రాజారాంపల్లి గ్రామ పంచాయతీ వద్ద వెల్గటూర్, ఎండపల్లి మండలంలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను అందజేశారు. రాజారాంపల్లి ప్రజా ఆశీర్వాద యాత్రకు వచ్చిన మంత్రికి ధర్మపురి మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన నాలుగేండ్ల రేగొండ రితిక తను ఏడాది నుంచి జమ చేసుకుంటున్న కిడ్డీ బ్యాంక్ పెట్టెను తన నాన్న మహేశ్తో కలిసి అందజేసింది. దీంతో మంత్రి చెమ్మగిల్లిన కళ్లతో అమ్మాయిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ బొడ్డు సుధారాణి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జీరెడ్డి మహేందర్రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, సర్పంచులు గెల్లు చంద్రశేఖర్, కంది లావణ్య-విష్ణుమూర్తి, కొమ్ము రాంబాబు, మారం జలేంధర్రెడ్డి, కొప్పుల విద్యాసాగర్, గంగుల నగేశ్, యాగండ్ల తిరుపతి, ముల్కల్ల గంగారాం, మండల పార్టీ అధ్యక్షుడు చల్లూరి రాంచందర్గౌడ్, సింహాచలం జగన్, మండల యువత అధ్యక్షుడు బిడారి తిరుపతి, రామగిరి మల్లేశ్, నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, జూపాక కుమార్, మూగల సత్యం, కోడి గంగయ్య, రాజేశ్, సంగ రమేశ్, మ్యాకల సంతోశ్, పెద్దూరి భరత్కుమార్, పడిదం మొగిలి, రవి, తిరుపతి, చుంచు మల్లేశ్, అంజీ, రాజేశం, రామయ్య పాల్గొన్నారు.