హుజూరాబాద్టౌన్,జనవరి12: వివేకానందుడు నేటి తరానికి ఆదర్శప్రాయుడని ప్రజాప్రతి నిధులు, నాయకులు కొనియాడారు. గురువారం వివేకానందుడి 160వ జయంత్యుత్సవాలను ని యోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. హుజూరాబాద్ పట్టణం వరంగల్రోడ్డు డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్ర హాన్ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సంద ర్భం గా వారు మాట్లాడుతూ జాతికి జీవితాన్ని అంకి తం చేసిన మహనీయుడని ప్రశంసించారు. ఇ క్కడ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టౌన్ సీఐ బొల్లం రమేశ్, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, ముక్క రమేశ్, ఉమామహేశ్వర్, పైళ్ల వెంకట్రెడ్డి, ప్రతాప తిరుమల్రెడ్డి, కల్లెపల్లి రమాదేవి, మంద ఉమాదేవి రమేశ్, కేసీరెడ్డి లావణ్య, ఏ ముత్యంరాజు, మక్కపెల్లి కుమార్యాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సామాజిక కార్యకర్తలు వర్దినేని రవీందర్రావు, కోటోజు జ్యోతిరాణి, శ్రీదేవి, ఉత్సవ కమిటీ నాయకులు కాజిపేట కృష్ణ, శ్రీనివాస్, దండ విక్రంరెడ్డి, ప్రతాపకృష్ణ, కల్లెపు సుధాకర్రావు, గుంటి శ్రీనివాస్, బీజేపీ నేతలు అంకతి వాసు, జీ ప్రభాకర్, రావుల వేణు, బీఆర్ఎస్ నే తలు చింత శ్రీనివాస్, బీఎస్ ఇమ్రాన్, ఎండీ ఖా ళీద్హుస్సేన్, చందా గాంధీ, గందె సాయి, పం జాల సతీశ్, మల్లేశం, నల్ల సుమన్, సందమల్ల బా బు, బీఆర్ గౌడ్, విడపు రాజు, సంజీవరెడ్డి, మ నోజ్, తిరుపతి, పవన్, కేశవ్, రాజశేఖర్, వొడ్నా ల విజయ్, కుమార్ పాల్గొన్నారు.
చెల్పూర్ పంచాయతీ అవరణలోని వివేకానందుడి విగ్ర హానికి నాయకులు నివాళులర్పించారు. కార్యక్ర మంలో సర్పంచ్లు మహేందర్ గౌడ్, కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, వార్డు సభ్యులు సారయ్య, రవీందర్, కుమార్, భారతమ్మ, లక్ష్మీ, అజ్జు, రాములు, రాజయ్య, సంజీవరెడ్డి ఉన్నారు.
వివేకానందుడి జీవితం ఆదర్శనీయమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు పిలుపు నిచ్చారు. స్థాని క శివాలయం సమీపంలోని వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు తెలంగాణచౌక్ నుంచి విగ్రహం వరకు యువత భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమాల్లో వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కమిషనర్ కే సమ్మయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మండలంలోని లస్మన్నపల్లితో పాటు పలు గ్రామాల్లో వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ దేశప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు.
లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
యువత స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని సాధనకు కృషి చేయాలని ఎస్ ఐ శేఖర్రెడ్డి ఉద్బోధించారు.మండలంలోని ఘ న్ముక్ల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, నృత్యం, పాటల పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎస్ఐ హాజరై వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పిం చా రు. అనంతరం విజేతలకు బహుమతులు అం దజేశారు. ప్రిన్సిపాల్ డా.వేణుగోపాల్రెడ్డి, ఉపాధ్యాయులు హఫీజొద్దీన్, చిరంజీవి పాల్గొన్నారు.