రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, మే 30: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ప్రతి తెలంగాణ బిడ్డా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సూచించారు. పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్జయంతితో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ వచ్చే నెల జూన్ 2 నుంచి 22 వరకు చేపట్టబోయే ఉత్సవాల కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, స్వరాష్ట్రం సిద్ధిస్తుందో లేదో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఉద్యమ నా యకుడు కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు.తెలంగాణ ఏర్పడితే అంధకారం తప్పదని, విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకునే దుస్థితి వస్తుందని ఆనాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి భయభ్రాంతులకు గురిచేశారని, కానీ, స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే సమృద్ధిగా సాగుకు కరెంటును తెచ్చి సీమాంధ్ర నాయకుల మాటలు తప్పని నిరూపించామని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మండెపల్లిలో ఏర్పాటు చేసిన ఐటీడీఆర్ ద్వారా వాహన చోదకులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తొమ్మిదేండ్లలో సాధించిన ఇలాంటి విజయాలు ఎ న్నింటినో ప్రజలందరికీ వివరించేలా వేడుకల ను ఘనంగా నిర్వహించాలన్నారు. ఇక్కడ ఎ స్పీ అఖిల్మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ జిం దం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఆర్బీ ఎస్ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్, డీఏవో భాస్కర్, సీపీ వో శ్రీనివాసచారి, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఏడీ హాండ్లూమ్స్ సాగర్, సెస్ ఎండీ రామకృష్ణ, పరిశ్రమల శాఖ జీఎం ఉపేందర్రావు, డీసీఎస్వో జితేందర్రెడ్డి, మేనేజర్ జితేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
తెలంగాణ దేశానికే దిక్సూచి
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఈ రోజు ధాన్యం ఉత్పత్తి, విద్యుత్ వినియోగంలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా ని లిపాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సఫ ల రాష్ట్రంగా స్థిరపడడం తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకూ గర్వకారణం. ఎక్కడా లేని విధంగా 24 గంటల నాణ్యమైన వి ద్యుత్ను వ్యవసాయానికి అందిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆర్థికంగా వె నుకబడిన అగ్రవర్ణాలకు అన్ని విధాలుగా అండగా నిలిచాం. రాష్ట్రం ఏర్పడక ముం దు 200 గురుకులాలు మాత్రమే ఉంటే ఇప్పుడు వెయ్యి గురుకులాలకు పెంచాం. ఒక్కో విద్యార్థిపై లక్షా 25 వేలు ఖర్చు చేస్తు న్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బిడ్డలు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మన దే. వచ్చే పదేండ్లకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగాలో కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికలు రూపొందిస్తాం.
– విలేకరుల సమావేశంలో వినోద్కుమార్