Vinayaka Chavithi | రుద్రంగి, ఆగస్టు 22: రుద్రంగి మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక చవితి వేడుకలు జరుపుకోవాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని గణేష్ మండలి నిర్వాహకులు, యువకులతో సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలకు, మతపరమైన ఘర్షణలకు పాల్పడవద్దని అన్నారు.
మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజీలకు అనుమతి లేదని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, గణేష్ మండలి నిర్వాహకులు, నాయకులు, పోలీసు సిబ్బంది, యువకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.