కమాన్చౌరస్తా, జనవరి 30: వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. మేళాతాళాల మధ్య వేం కటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయ షష్ఠమ బ్రహ్మోత్మవాల్లో భాగంగా సోమవారం యాగశాలలో నిత్యాపూర్ణహూతి నిర్వహించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరుడు, పద్మావతి, అలివేలుమంగ విగ్రహాలను అలంకరించా రు. అనంతరం శ్రీదేవీ భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యుల నేతృత్వం లో, ఈ వో ఉడుతల వెంకన్న దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అలాగే, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల తరఫున కన్యాదాతగా తిరుమల తాళ్లపాక వంశ 12వ తరం వారుసుడు హరినారాయణాచార్యులు వ్యవహరించారు. అర్చకులు చక్రవర్తుల లక్ష్మీనారాయణాచార్యులు, చె న్నోజుల నాగరాజాచార్యులు కల్యాణం జరిపించా రు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది.
అనంతరం మంత్రి గంగుల ఆధ్వర్యంలో తిరుమల నుంచి తెప్పించిన 15000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేశా రు. ఇక్కడ గోగుల ప్రసాద్ ఆ ధ్వర్యంలో ఆలపించిన కీర్తనలు, పాటలు భక్తులను అలరించాయి. సీపీ సుబ్బారాయుడు ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపన ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, మేయర్ సు నీల్రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ, డిప్యూటీ మే యర్ చల్లా స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్లు, ఉత్సవ కమిటీ సభ్యులు గంప రమేశ్, గో గుల ప్రసాద్, టీ రవీందర్, కే దేవత, రవికుమార్, జీ సంతోష్కుమార్, పీ తిరుపతి, బీ వనిత, కే లత, పీ రాహుల్నారాయణ, డీ ఉపేంద్రనాథ్, కే శ్రీనివాస్, కే శ్రీనివాసావరప్రసాద్, పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ శ్రీధర్, జీ భూపతి, బీ విద్యాసాగర్, వాస్తు రామన్న, టీ సుభాష్, ప్రశాంత కుమార్, భద్రయ్య, భాసర్ ఉన్నారు. సాయంత్రం స్వామివారు మాడ వీధు ల్లో విహరించారు.