ముంపు గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
దళిత బంధు దేశానికే ఆదర్శం
స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్బాబు
వేములవాడ రూరల్, జూన్ 10: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగ ణాల కు వేములవాడ నియోజకవర్గమే స్ఫూర్తిదాయకమని స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. గతంలో చందుర్తిలో నిర్వహించిన క్రీడలను సందర్శించిన సందర్భంలో ఈ ఆలోచన స్ఫురించిందన్నా రు. యువత సెల్ఫోన్ మోజులో పడి చెడిపోతున్నదని, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుతో ఆటలకు సమయం వెచ్చించే అవకాశం ఉంటుందని పోలీసు అధికారులతో చర్చించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఉపక్రమించిందని చెప్పారు. శుక్రవారం చంద్రగిరి, చీర్లవంచ గ్రామాల్లో పర్యటించారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి భూమిపూజ చేశారు. చీర్లవంచలో ‘మన ఊరు- మన బడి’ కింద రూ. 60 లక్షలతో చేపట్టిన స్కూల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహిళా, ఎస్సీ కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోని తల్లిదండ్రులను పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహిస్తున్నారని, ఇదే తరహాలో మన పిల్లలు కూడా ఆటపై దృష్టిపెట్టేలా చూడాలని ఉ ద్బోధించారు. విద్య, వైద్యరంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. అనంతరం ఎమ్మె ల్యే రమేశ్బాబు చంద్రగిరిలో చీర్లవంచకు చెం దిన లబ్ధిదారుడు కారం రాజయ్య సూపర్ మా ర్కెట్ను ఏర్పాటు చేసుకోగా వినోద్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు మెరుగైన యూనిట్లను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆ కాంక్షించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మ న్ ఆకునూరి శంకరయ్య, ఎంపీపీ బూర వజ్ర మ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి, సర్పంచులు రా సూరి రాజేశం, రంగు సత్తమ్మ, ఎంపీటీసీ వనపర్తి దేవరాజు, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, సెస్ డైరెక్టర్ హరిచరణ్రావు, సర్పంచుల ఫోరం అ ధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి, వెంకటరమణ, చెన్నమనేని స్వయంప్రభ, రేగులపాటి రాణి, లక్ష్మారెడ్డి, సహకార సంఘం చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు, నేతలు బూర బాబు, నరేశ్, హరికృ ష్ణ, పరశురాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.