వేములవాడలో బీఆర్ఎస్లో చేరుతున్న చింతకుంట విశ్వబ్రాహ్మణులకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న చల్మెడ లక్ష్మీనర్సింహారావు, చిత్రంలో లోక బాపురెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య కథలాపూర్, అక్టోబర్ 22: వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు బలం పెరుగుతున్నది. ఊరూరా పలు సంఘాల మద్దతు లభిస్తున్నది. ఆదివారం కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మార్క్ఫెడ్ మాజీ చైర్మన్లోక బాపురెడ్డి ఆధ్వర్యంలో వేములవాడలో చల్మెడకు మద్దతు పలికారు. ‘కారు గుర్తుకే ఓటు వేస్తాం.. చల్మెడను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని’ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అలాగే కథలాపూర్ మండలం దూలూర్, తక్కళ్లపెల్లి, బొమ్మెన, గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు 100 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి చల్మెడ లక్ష్మీనర్సింహారావు కండువాలు కప్పి ఆహ్వానించారు. చల్మెడను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముక్తకంఠంతో ప్రకటించారు. అనంతరం మార్క్ఫెడ్ మాజీ చైర్మన్లోక బాపురెడ్డి మాట్లాడారు.
కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని, అప్పుడు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను దొంగల పాలు చేయవద్దని, ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం భూమయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గడీల గంగప్రసాద్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బొడ్డు బాలు, నాయకులు గుండారపు గంగాధర్, సోమ దేవేందర్రెడ్డి, గంగం గంగారెడ్డి, అందె స్వాగత్చారీ, చెక్కపెల్లి రాజ్కుమార్, నల్ల గంగాధర్, అరుణ్, ఈశ్వర్ ఉన్నారు.