వేములవాడ టౌన్, జనవరి 13 : వేములవాడ రాజన్న ఆలయంలో లయబ్రహ్మ, నాదబ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజ శుక్రవారం కార్యక్రమాలు ప్రేక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తాయి. రాత్రి 8 గంటలకు వేములవాడ సామప్రియ సభ్యులు నందగిరి సతీందర్, దివన్నగారి శ్రీదేవి, రాగంపేట శ్రీవిద్య సంగీత కచేరి, సతీందర్ గానం ఆద్యంతం వీనుల విందుగా సాగింది.
ఉదయం 10 గంటలకు బీ భారతి భాగవతార్ చెప్పిన హరికథ, సాయం త్రం 4 గంటలకు కొరిడె నరహరి, చౌటి రఘునందన్, అపర్ణ బృందం ఆలపించిన సంగీత కచేరి శ్రోతలను ఆనందడోలికల్లో ముంచివేసింది. 5 గంటలకు జ్యోత్స్న, 6.30 గంటలకు ధూళిపాల వాసవి సంగీత కచేరి అలరించింది. ఈ కార్యక్రమాల్లో ఆలయ అధికారులు, వఝల శివకుమార్, అష్టావధాని తిగుళ్ల శ్రీహరిశర్మ, డాక్టర్ మామిడిపల్లి రాజన్న, నందగిరి రాజేంద్ర శర్మ, ప్రతాప సంతోష్, రాగంపేట మల్లికార్జున్, చెల్లపెల్లి సీతారాములు, సంగీత, సాహిత్యాభిమానులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.