మానకొండూర్, నవంబర్ 30: ఊరూరా తిరిగి పాత సామాన్లు, పేపర్లు కొని వాటిని అమ్మి పూట వెల్లదీస్తున్న బతుకులపై మృత్యుశకటం దూసుకొచ్చింది. తెలవారుజామున వేగంగా వచ్చి వారి బతుకులను తెల్లార్చింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మానకొండూరులో బుధవారం వేకువజామున జరిగిన ఈ ఘటన రాజీవ్కాలనీలో విషాదం నిం పింది. సీఐ రాజ్కుమార్, ప్రత్యక్ష సాక్షుల వివరా ల ప్రకారం.. మానకొండూర్ మండల కేంద్రంలో ని రాజీవ్నగర్ కాలనీకి చెందిన పస్తెం లచ్చవ్వ (35), కడమంచి రాజవ్వ (40) పరిసర గ్రామా ల్లో పాత ఇనుప సామాన్లు, పాత పేపర్లు కొనుగో లు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున 5గంటలకు ఇంటినుంచి బయలు దేరి స్థానిక పల్లెమీద స్టేజీ వద్ద గల ఓహోటల్లో టీ తాగి తిరిగి కాలినడకన ఇంటికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో వరంగల్వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న అర్టీసీ బస్సు కరీంనగర్-వరంగల్ రహదారిపై రాజీవ్నగర్ కాలనీ బోర్డు సమీపంలో లచ్చవ్వ, రాజవ్వను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే స్థలంలోనే మృతిచెందారు. లచ్చవ్వకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు కాగా, రాజవ్వకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వారి భర్తలు గతంలోనే వేర్వేరు కారణాలతో మృతిచెందారు. రోడ్డుపై పడిఉన్న మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న సీఐ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలకు పంచానామ నిర్వహించి పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా బస్సును నడపడంతోనే ఈప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీసీ పుటేజీ అధారంగా బస్సు ను గుర్తించామని, డ్రైవర్ను ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.