ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
ఇద్దరు యువకుల సజీవ దహనం
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో ప్రమాదం
మృతులిద్దరూ జగిత్యాల జిల్లా వాసులు
వేల్పూర్, జూన్ 27: వారిద్దరు ప్రాణ స్నేహితులు.. ఎటు వెళ్లినా కలిసే వెళ్లేవారు. చివరకు మృత్యువులోనూ కలిసేపోయారు. ఆదివారం అ ర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామానికి చెందిన మండలోజి అనిల్ కుమార్(24), కోరుట్లకు చెందిన బెజోజ సుమంత్(24) ప్రాణ స్నేహితులు. ఆదివారం రాత్రి పని కోసం కారులో మెట్పల్లి నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలోని వేల్పూర్ ఎక్స్రోడ్డు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కనే బోర్లాపడడం.. ఒక్కసారిగా కారులో నుంచి మంటలు వ్యాపించడంతో కారులో ఉన్న ఇద్దరు సజీవ దహనమయ్యారు. అర్ధరాత్రి కావడంతో వీరిని ఎవరు కాపాడలేకపోయారు. ఓవ్యక్తి గమనించి డయల్ 100కు కాల్ చే యడంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బం ది వచ్చి మంటలు ఆర్పి వేసినా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వేల్పూర్ ఎస్ఐ వినయ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబీకులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనా స్థలంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేసింది.
చేతికొచ్చిన కొడుకులు..
మెట్పల్లి మండలం వెల్లుల గ్రామానికి నారాయణ-విజయకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు మండలోజి అనిల్ కుమార్ మెట్పల్లిలో గోల్డ్స్మిత్గా పనిచేస్తున్నాడు. ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో తండ్రి నారాయణ సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. కోరుట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్-రాధలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్న ఒక్క కుమారుడు సుమంత్ ప్రమాదంలో మృతి చెందడంతో మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. సుమంత్ మెట్పల్లిలోని ప్రైవేట్ దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. కాగా, ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.