రామడుగు, ఆగష్టు 6: కరెంట్షాక్తో రెండు జోడెడ్లు మృతి చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పన్యాల లచ్చిరెడ్డికి చెందిన పొలంలో ఆదివారం ఉదయం రైతు శనివారం మల్లేశం వరి నాటేసుందుకు ఎడ్లతో గొర్రు కొడుతున్నాడు. పొలం గట్టుపై ఉన్న విద్యుత్ స్తంభం( ఇనుప పోల్)కు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో గొర్రు కట్టిన ఎడ్లు కరెంటషాక్కు అకడికకడే మృతి చెందాయి. కాగా, మల్లేశం ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలాన్ని ట్రాన్స్ కో అధికారులు పరిశీలించారు.