హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాల ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని సూచించారు. రాష్ట్రంలో వారంరోజులపాటు అతి భారీవర్షాలు కురుస్తాయ ని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో డ్రైవర్లందరూ భద్రత సూచనలు పా టించాలని కోరారు. బుధవారం హైదరాబాద్లోని బస్భవన్లో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలిచిందన్నారు. జాతీయస్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకుందని గుర్తుచేశారు.ఆర్టీసీ సంస్థలో సుశిక్షుతులైన డ్రైవర్లున్నారని, అయినా వర్షాకాలంలో మరోసారి భద్రత నియమాలను మననం చేసుకుని తూచ తప్పకుండా పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం అవసరమన్నారు.