కమాన్చౌరస్తా, మార్చి 17: ‘పది’ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగనున్న ఎగ్జామ్స్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, మొత్తం 38,097 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షా సమయం కాగా, గంట ముందే చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
కాగా, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, లోపాలు లేకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తే.. విజయం తథ్యమని పలు సూచనలు చేస్తూనే, మాస్ కాపీయింగ్కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.