కొడిమ్యాల, జూలై 8 : ప్రధాని నరేంద్ర మోదీ తె లంగాణ అభివృద్ధి కోసం చేసిందేం లేదని, దేశం తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో చాలా వెనకబడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం కడుతున్న పన్నులతో గజరాత్ రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దితే, మోదీ మాత్రం వరంగల్లో గాలిమాటలు మా ట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వృద్ధులకు 2 వేల పింఛన్, కల్యాణలక్ష్మి, రైతు బీమా. రైతు బంధు పథకాలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలన్నారు. మన గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇటీవలే తెలంగాణ పల్లెలకు దేశ స్థాయి లో 17 ఆవార్డులు వచ్చాయని చెప్పారు.
గతంలో వ రంగల్కు ఇందిరా గాంధీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రకటిస్తే బీజేపీ ప్రభుత్వం గుజరాత్కు తరలించిందని చెప్పారు. అవినీతి పాలనలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానం లో మోదీ ఉన్నారని విమర్శించారు. రాష్ర్టానికి మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మోదీ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోదీ మాట తప్పారని విమర్శించారు. నల్లధనం అం తా అంబానీ, అదానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పులి వేంకటేశం గౌడ్, రైతు బంధు మండల కన్వీనర్ అంకం రాజేశం, సింగి ల్ విండో చైర్మన్ పొలు రాజేందర్ ఉన్నారు.