సిరిసిల్ల టౌన్, మార్చి 26: వందరోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసి.. నేతన్నలను రోడ్డునపడేసిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ విమర్శించారు. పొట్టకూటి కోసం నేతన్నలు మళ్లీ వలస వెళ్లే పరిస్థితులు వచ్చాయని ఆవేదన చెందారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. డిసెంబర్ 9తర్వాత మంచి రోజు లు తెస్తామని చెప్పి, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. వంద రోజుల పాలనలోనే నేతన్నల ఉపాధిని అడ్డుకుని వారిని రోడ్డునవేసిందని ఆరోపించారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యామిషన్, రంజాన్, క్రిస్మస్, కేసీఆర్ కిట్స్ పథకాలకు సంబంధించి దాదాపు 3,400 కోట్ల ఆర్డర్లు అందించిందన్నారు. తద్వారా కార్మికులు చేతినిండా పనితో సంతోషకరమైన జీవనం సాగించారన్నారు. కంటితుడుపు చర్యలో భాగంగా 365రోజులు పని కల్పిస్తామని జీవో విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభు త్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా ఏ విధంగా ఉపాధి కల్పిస్తుందో సంబంధిత క్యా లెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. ఉపాధి లేక సిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమ యంలో అనేక దుర్భర పరిస్థితులు ఉండేవన్నారు. నేత కార్మికుల విషయంలో రాజకీయాలు వద్దని సూచించారు.
నేత కార్మికులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న యారన్ సబ్సిడీ, ఆసాములు, కార్మికులకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, బృహత్తర సంకల్పం తో కేసీఆర్ నాడు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు అం దించారన్నారు. ఆసాములు, యజమానులు, ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేస్తు న్నదని ఆరోపించారు. వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వకపోవడంపై నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పందించాలన్నారు.
ఆర్డర్లు, సబ్సిడీ లేక ఉపాధిని కోల్పోయిన నేతన్న చేతుల్లో కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిడ్డి రాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ వంద రోజుల పాలనలో నేతన్నలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. రాజకీయ కక్షసాధింపు మానుకొని నేతన్నల ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, రాపెల్లి దినేష్, గెంట్యాల శ్రీనివాస్, మ్యాన రవి, గుండ్లపల్లి పూర్ణచందర్, గడ్డం భాస్కర్, పోరండ్ల రమేశ్, సామల శ్రీనివాస్, మండల బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.