విద్యానగర్, మార్చి 31 : తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదో ఒక లోపం కనిపిస్తున్నది. ఈ సమస్యను ముందుగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్ దోహదం చేస్తుంది. గర్భంలోని శిశువుకు అవయవాలు ఏర్పడే దశ అంటే 18 నుంచి 22 వారాల మధ్యలో ఈ స్కానింగ్ చేసి, లోపాలు ఉంటే వెంటనే తగిన చికిత్స అందిస్తే నివారించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు ఉన్నా వాటికి టిఫా స్కాన్ తీసే సామర్థ్యం లేదు.
ప్రైవేట్ ల్యాబ్ల్లో టిఫా స్కాన్కు 2500 నుంచి 3000 దాకా వసూలు చేస్తుండడంతో పేదలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. సమస్యను గుర్తించిన మంత్రి హరీశ్రావు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే కొనుగోలుకు ఆదేశించడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రసూతి కేంద్రాల్లో టిఫా స్కానింగ్ సదుపాయం కలిగిన అల్ట్రాసౌండ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో మిషన్ ధర 35 లక్షలు ఉండగా, గత నవంబర్ 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో 70 లక్షల వ్యయంతో రెండింటినీ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 600 మందికి పరీక్షలు చేశారు.
ఈ పరీక్ష ఎవరికీ అవసరం..
టిఫా స్కానింగ్తో గర్భంలో ఉన్న శిశువు కాళ్లు, చేతులు, ముఖం, చెవులు, ముకు, నోటితో పాటు గుండె, ఊపిరితిత్తుల పనితీరు వంటి విషయాలు తెలుసుకోవచ్చు. ప్రధానంగా మేనరికపు వివాహాలు, జన్యులోపాలు, అవయవ లోపాలు, గ్రహణం మొర్రి, మెదడుకు సంబంధించిన లోపాలు, మూత్ర పిండాలకు సంబంధించిన లోపాలు, గుండెకు సంబంధించిన లోపాలు, మానసిక సమస్యలు ఉన్నవారిని పరిగణనలోకి తీసుకొని టిఫా సానింగ్ పరీక్షలు చేస్తారు. అందుకు సంబంధించిన మందులు వాడితే వాటిని అధిగమించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఉపయోగం ఏమిటి ?
అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 7 శాతం శిశువుల్లో లోపాలు ఉండే అవకాశం ఉన్నది. అంటే పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు శారీరకంగా ఏదో ఒక లోపంతో పుడతారు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, సరైన పోషకాహారం లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల శిశువుల్లో లోపాలు తలెత్తుతాయి. అయితే ఇందులో అత్యధిక శాతం ముందే గుర్తిస్తే నయం చేయగలిగేవే. ఇలాంటి లోపాలను ‘టిఫా స్కాన్’తో గుర్తించే అవకాశం ఉన్నది.
గర్భిణులకు మేలు..
కరీంనగర్లోని ఎంసీహెచ్కు నిత్యం వంద మంది దాకా గర్భిణులు వస్తారు. అన్నిరకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. అయితే ఇన్నిరోజులు టిఫా స్కానింగ్ సౌకర్యం లేకపోవడంతో బయట ప్రైవేట్లో చేయించుకునేవారు. దీని వల్ల పేదలపై ఆర్థికభారం పడేది. ఈ క్రమంలో ప్రభుత్వం సమస్యను గుర్తించి ఎంసీహెచ్లో రెండు అత్యాధునిక టిఫా సానింగ్ మిషన్లను ఏర్పాటు చేయించింది. ఇది గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్థికభారం తప్పుతుంది.
– డాక్టర్ నవీన, ఇన్చార్జి (ఆర్ఎంవో)
లోపాలు గుర్తించవచ్చు..
టిఫా సానింగ్ యంత్రాలతో గర్భస్థ దశలోని శిశువు తల, అవయవాల ఎదుగుదలలో లోపాలను గుర్తించవచ్చు. నిన్నటి వరకు కేవలం అల్ట్రాసౌండ్ సానింగ్ మాత్రమే అందుబాటులో ఉండేది. శిశువు లోపాలు గుర్తించే సౌకర్యం లేకపోయింది. ఇప్పుడు ప్రభుత్వమే టిఫా సాన్ మిషన్ను ఏర్పాటు చేసింది. గర్భస్థ శిశుశిశువుకు పరీక్షలు సులభమైంది.
– డాక్టర్ రవీందర్, రేడియాలజిస్ట్